కేటీఆర్ చెప్పింది అక్షర సత్యం: ఏపీలో సౌకర్యాలపై సీపీఐ నారాయణ

Publish Date:Apr 30, 2022

Advertisement

సీపీఐ పార్టీ సీనియర్ నేత  నారాయణ ఏమి చేసినా.. ఏది మాట్లాడినా ఓ సంచలనం అవుతుంది. ఏపీ అసెంబ్లీలో 151 సీట్లు గెలిచిన సీఎం జగన్ ను పొగుడుతూనే ఇంకా బానిస బతుకేనా? అంటూ చురకలంటించినా, ప్రధాని మోడీని వరసపెట్టి ఏకేసినా.. ఆర్కే రోజా నియోజవర్గం నగరిలో ఉపాధి కూలీగా మారి, పని చేసినా... ‘అదొక బ్రోతల్ హౌస్’ అని బిగ్ బాస్ షోని పోల్చినా.. సినీ నటి కంగనా రనౌత్ ని ‘కాస్ట్లీ బిచ్చగత్తె’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినా.. వైసీపీ- బీజేసీ సహజీవనం చేస్తున్నాయన్నా నారాయణ రూటే సెపరేట్ గా ఉంటుందనేది నిర్వివాదాంశం. అంతుకే నారాయణ ఏం చేసినా.. ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటాయి.

తాజాగా.. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఏపీలో కరెంట్ లేదు.. నీళ్లు ఉండవు.. రోడ్లు అధ్వాన్నం.. అసలు మౌలిక సదుపాయాలే ఉండవు‘ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభ వేదిక నుంచి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని నారాయణ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో నారాయణ ఆంధ్రా- తమిళనాడు సరిహద్దును పరిశీలించి.. ఇరు రాష్ట్రాల్లోని రోడ్ల పరిస్థితిని పోల్చి మరీ నారాయణ వ్యాఖ్యానించడం విశేషం. ఏపీలో రోడ్లు గుంతలతో నిండిపోయి ఉన్నాయని, పొరుగు రాష్ట్రాల్లో చక్కగా ఉన్నాయని చెప్పారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఒక పక్కన ఫైరైపోతున్న సమయంలో తాను ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని నారాయణ మాట్లాడడం గమనార్హం.

మొన్నా మధ్యన బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. ‘అదొక బ్రోతల్ హౌస్’ అని నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక సోషల్ క్రైమ్ అని, దాని వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేదని అన్నారు. భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని, అది ఒక భిక్ష అని సినీనటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందిస్తూ.. ‘కంగన ఒక విలాసవంతమైన బిచ్చగత్తె’ అంని నిప్పులు చెరగడం అందర్నీ ఆశ్చార్యానికి గురిచేసింది. మోడీ ప్రధాని అయ్యాయే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆమె మాటల్ని తిప్పికొడుతూ.. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే అర్హతే కంగనకు లేదని,  ఆ వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశ ప్రజలకు కంగన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం.

బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నారాయణ స్పందిస్తూ.. ఏపీలో వైసీపీ- బీజేపీ సహజీవనం చేస్తున్నాయని.. మధ్యలో దూరిన పవన్ కు బీజేపీ రోడ్ మ్యాప్ ఇందుకిస్తుంది? ఇవ్వదని తేల్చి చెప్పేయడం కమలం- ఫ్యాన్ గుర్తుల రహస్య బంధాన్ని బయటపెట్టేయడం ఆసక్తిగా మారింది. గత ఏడాది మే నెలలో నారాయణ ఉపాధి హామీ కూలీగా మారడం విశేషం. చిత్తూరు జిల్లాలోని ఆర్కే రోజా సొంత ఇలాకా నగరి నియోజకవర్గంలోని అయనంబాక చెవురులో రెండు రోజులు ఉపాధి హామీ కూలిపనులు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లెఫ్ట్ పార్టీలు ఉద్యమించి, పార్లమెంట్ లో  సాధించుకున్న పథకం అని ఆయన చెప్పడా గమనార్హం.
ఇటీవలే కమ్యూనిస్తు నేత నారాయణ విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించడం, పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలుసుకోవడం సంచలనంగా మారింది. సమ సమాజ స్థాపనకు జీవితాన్నే ధారపోసిన నారాయణ ఇలా స్వామీజీ దర్శనం చేసుకోవడం, నారాయణకు స్వామీజీ కాషాయం కండువా కప్పి ఆహ్వానించడం, స్వామీజీకి శిరసు వంచి, చేతులు జోడించి నారాయణ నమస్కారం చేయడం ఆసక్తిగా మారింది.

ఇటీవలే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి విధానాన్ని తప్పుపడుతూ సీపీఐ నారాయణ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా జరగలేదని, ఎమ్మెల్యేలను సంప్రదించకుండా జిల్లాల్ని విభజించడం జగన్ సొంత వ్యవహారం కాదని కామెంట్ చేయడానికి నారాయణ వెనుకాడలేదు. అసలు జిల్లాల విభజనకు గవర్నర్ ఏ విధంగా అంగీకరించారని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేస్తారా? అని నారాయణ నిలదీయడం గమనించదగ్గ విషయం. గవర్నర్ గా తాను ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని అని నారాయన అనడం సంచలనం అయింది. ఏపీలో విద్యుత్ ధరలను పెంచినప్పుడు కూడా ప్రభుత్వ నిర్ణాయినిక వ్యతిరేకంగా నారాయణ స్పందించారు. ప్రధాని మోడీ, జగన్ ప్రజలపై విద్యుత్ ధరలు పెంచి భారం మోపుతున్నారని ఆక్షేపించారు.

జాతీయ రహదారి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే.. ఊరుకోబోమని, భూములు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని అధికారులు బెదిరించడం దుర్మార్గమని అన్నారు. అలా చేస్తే అధికారుల చేతివేళ్లు కట్ చేస్తామని నారాయణ హెచ్చరించడం సంచలనం అయింది. 

By
en-us Political News

  
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.